Crime
ఫ్రెండ్ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని.. అతని భార్యతో అఫైర్

సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కారణంగానే చాలా దారుణాలు జరుగుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉంటున్న వారిని చంపేయడం.. లేదా వాళ్లే చనిపోవడం వంటివి ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువైపోయాయి. ఇటీవల కృష్ణా జిల్లాలో జరిగిన సంఘటన కూడా ఈ కోవలోకే వస్తుంది. కృష్ణా జిల్లా వేలేరు గ్రామానికి చెందిన బొబ్బిలి డేనియల్ అలియాస్ బాలు ఊక లారీపై పని చేస్తుంటాడు. అతడి పాటే పని చేసే రాజాబాబు అనే వ్యక్తి చాలా అమాయకుడు. అసలు ఫోన్ వాడడం కూడా తెలీదు.
అందుకే అతడు ఫోన్ కూడా వాడేవాడు కాదు. అందుకే బాలు దగ్గర ఫోన్ తీసుకుని తన భార్యతో మాట్లాడేవాడు. ఇదే అవకాశంగా తీసుకున్న బాలు.. ఆమెకు ఫోన్ చేసి మాటలు కలిపాడు. ఆ తర్వాత వీరిద్దరూ ఏకాంతంగా కలిశారు. ఈ విషయం రాజాబాబుకు తెలియడంతో వాళ్లిద్దరినీ హెచ్చరించాడు. గత నెల 23న పని నుంచి రాజాబాబును వేలేరు పరిధిలోని పోలవరం కాలువ సమీపంలోకి తీసుకెళ్లి మద్యం తాగించి ఆ తరువాత కొట్టి చంపేశాడు. దీనిని హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు ఛాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది.
Comments
Crime
నా చావుకి కారణం మోహన్ బాబే… సూసైడ్ లెటర్ రాసిన సీరియల్ నటి

మోహన్ బాబు కారణంగా మనస్తాపం చెందిన ఓ తమిళ నటి సూసైడ్ చేసుకుంది. ప్రేమించి మోసం చేసిన మోహన్ బాబు మోసం చేయటం తోనే చనిపోతున్న అంటూ తన అమ్మకి మెసేజ్ పంపి మరి చనిపోయింది. మేరీ షీలా జేబిరాణి అలియాస్ యాషిక యాక్టింగ్ మీద మక్కువతో చెన్నై వెళ్ళింది. అక్కడ అవకాశాలు దక్కించుకొని పాలు సీరియళ్లలో నటించింది. కాగా చెన్నై వెళ్లాకా… యాషిక హాస్టల్లో ఉంది. అక్కడ సమీపంలో ఉన్న మొబైల్ షాప్ ఓనర్ అరవింద్ అలియాస్ మోహన్ బాబు తో స్నేహం మొదలై ప్రేమగా మారింది . కొన్ని నెలల పాటు వీరిద్దరూ సహజీవనం కుడా చేసారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో యాషికని మోహన్ బాబు హింసించటం మొదలు పెట్టాడు. దీంతో విసిగి పోయిన యాషిక మోహన్ బాబుని ఇంట్లో నుండి బయటకి పంపింది. మోహన్ బాబు తర్వాత యాషికని పట్టించుకోవటం మానేసాడు. దీంతో తాను మోసపోయాను అని గ్రహించిన యాషిక చనిపోవాలని డిసైడ్ అయింది. చనిపోయే ముందు తన చావుకి మోహన్ బాబే కారణం అతనిని శిక్షించండి అంటూ తల్లికి మెసేజ్ చేసి ఆత్మ హత్య చేసుకొని ప్రాణాలు విడిచింది. యాషిక తల్లి పోలీసులకి చెప్పటంతో కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు మోహన్ బాబు ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు
Comments
Crime
పాకిస్తాన్ పై యుద్దానికి మరో కుమారుడిని పంపిస్తా…

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామలో అతి కిరాతకంగా ఉగ్ర వాదులు దాడులకి పాల్పడ్డారు. ఈ ఉగ్ర దాడిలో 44 మంది సిఆర్పియఫ్ జావానులు నేలకొరిగారు. దీనిపై దేశం మొత్తం ప్రతీకార చర్య కోసం రగిలి పోతుంది. పాకిస్తానీ ఉగ్రవాదులపై మరో సారి సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకార దాహాన్ని తీర్చుకోవాలని భారితీయులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. దేశ ప్రదాని మోడీ కూడా ఈ దాడిపై ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఈ ఉగ్ర దాడిలో మరణించిన ఓ జవాన్ తండ్రి చెప్పిన మాటలు… అందరిలో రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. బీహార్ భాగల్ పూర్ కి చెందినా రతన్ ఠాకూర్ ఉగ్ర దాడిలో మరణించిన సైనికులలో ఒకరు. అయితే కుమారుడి మరణ వార్త విన్న తండ్రి గుండె పగిలిపోయేలా దు:ఖించాడు. ఈ దాడిపై రతన్ ఠాకూర్ తండ్రి ఉద్వేగంగా మీడియాతో మాట్లాడు… నా పెద్ద కొడుకును భరత భూమి సేవలో కోల్పోయాను … ఇప్పుడు మరో కొడుకుని కూడా మాతృ భూమి సేవకి పంపుతాను. దేశ సేవలో నా కొడుకుని త్యాగం చెయటానికి సిద్దంగా ఉన్నాను. కాని పాకిస్తాన్ పై మాత్రం ప్రతీకారం తీర్చుకొని సమాదానం చెప్పాల్సిందే అంటూ ఉద్వేగ పూరితంగా మాట్లాడాడు. ఈ జవాను తండ్రి మాటలు అందరిని ఉద్వేగానికి లోను చేస్తున్నాయి.
Comments
Crime
మేన కోడలిని చంపి రక్తం తాగిన కసాయి అత్త…

భర్తకి దూరంగా ఉండటంతో మానసిక ఒత్తిడికి లోనయింది. దీంతో సైకోగా మారింది. తన మేనకోడలైన ఆరేళ్ళ చిన్నారిని చంపి రక్తం తాగింది. ఈ నిర్ఘాంత పోయే ఘటన విశాఖ మన్యం లోని పెదబయలు మండలంలో చోటు చేసుకుంది. వంతాల రాస్మో అనే మహిళా…ఆమె భర్తతో గొడవల కారణంగా చాలా కాలంగా తన సొంత ఊరైనా పెదబయలు మండలం లయపుట్టోలు లోని అమ్మగారింట్లో ఉంటంది. చాలా కాలంగా భర్తకు దూరంగా ఉండటంతో మానిసిక ఒత్తిడికి లోనయింది. దీనికి తోడు రాస్మో తమ ఇంటినుండి పోయి భర్తతో కలిసి ఉండాలంటూ తముడి భార్యతో పాటు ఇతర కుటుంబ సబ్యులు ఒత్తిడి తీసుకురావడంతో వాళ్ళపై కక్ష పెంచుకుంది రాస్మో. మానసిక ఒత్తిడి ఎక్కువ అయ్యి సైకో లాగా ప్రవర్తించటం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే తన తమ్ముడు కూతురుని చంపాలనుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆరేళ్ళ చిన్నారి అయిన తన మేన కోడలును కట్టెల కోసం అంటూ సమీప కొండపైకి తీసుకేల్లి కత్తితో తలపై నరికింది. దీంతో ఆ చిన్నారి అక్కడే ప్రాణాలు వదిలింది. తరవాత ఆ చిన్నారి రక్తాన్ని తాగింది. ఈ ఘటనను దూరం నుండి గ్రహించిన స్థానికులు అక్కడికి చేరుకునే లోపే చిన్నారి మృతి చెందింది. దీంతో వంతాల రాస్మో ని చెట్టుకి కట్టేసి కొట్టారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించగా…ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు చిన్నారి మృత దేహాన్ని స్వాదినం చేసుకొని నిందితురాలు రాస్మోని అదుపులోకి తీసుకున్నారు. కాగా గతేడాది క్రితమే తన భర్త చనిపోవటం… ఇపుడు తనకంటూ ఉన్న చిన్నారి కూడా మృతి చెందటంతో చిన్నారి తల్లి బోరున విలపిస్తుంది.
Comments
-
Featured1 week ago
తమిళ్ అర్జున్ రెడ్డి రీషూట్… హీరో తప్పా అందరూ చేంజ్
-
Featured1 week ago
మానవత్వం లేని మగాడుగా పుట్టడం దేనికి? – మంచు మనోజ్
-
Featured5 days ago
ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా చేస్తుంది చంద్రబాబే… ఇప్పటికి కొనసాగుతున్న బాబు వెన్నుపోటు
-
Featured4 days ago
సైకిల్ తొక్కాలి ఆరోగ్యానికి… సైకిల్ నే తొక్కాలి ఏపీ బాగుకి..- నాగబాబు
-
Featured2 days ago
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయలర్ … ప్రేమ, దగల మధ్య నలిగిన అసలు కథ … నిమిషాల్లో లక్షల్లో వ్యూస్
-
Featured3 days ago
యాత్ర గురించి గొప్పగా చెప్పిన వర్మ
-
Featured7 days ago
అనుమానంతో భార్య నగ్న చిత్రాలను కుటుంబీకులకు సెండ్ చేసిన భర్త
-
Featured7 days ago
పవన్ కు న్యాయం చేయాలి – కత్తి మహేష్